సూర్యవంశ తిలకుడి ప్రతిష్ఠ వేళ.. సౌర నగరంగా మారనున్న అయోధ్య
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయం జనవరి నాటికి ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. అదే ముహూర్తానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి సౌర నగరంగా అయోధ్య అవతరించనుంది. యూపీ కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ-యూపీఎన్ఈడీఏ ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు....







