హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదంటూ ఆంజనేయ స్వామి భక్త బృందం మరియు RSS కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా గూడూరులోని గాంధీనగర్ ప్రాంతంలో మునిసిపాలిటీ సిబ్బంది వచ్చి ఆంజనేయస్వామి గుడి ముందు ఉన్న వేప చెట్టు మరియు రావి చెట్టు కలయికను తొలగించి దూర ప్రాంతంలో ఉన్న అడివిలో పారవేశారు. అక్కడ ఉన్న ప్రజలు ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హిందువులు పాల్గొని సబ్ కలెక్టర్ గారికి మరియు రూరల్ పోలీసు సిఐ గారికి మున్సిపల్ కమీషనర్ మరియు సిబ్బందిపై ఫిర్యాదు చేయడం జరిగింది. గూడూరు కమిషనర్ గారి మీద చర్యలు తీసుకొని రావి చెట్టు వేప చెట్టు మళ్లీ అక్కడే ప్రారంభించాలని హిందువులు మరియు గాంధీనగర్ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు మరియు పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కోట సునీల్ కుమార్, ప్రసాద్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.