News

News

సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్‌’ డ్రోన్ల కలకలం

భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. పాకిస్థాన్‌ వెంబడి అంతర్జాతీయ సరిహద్దు నుంచి డ్రోన్ల అక్రమ చొరబాట్లు పెరగడం కలవరం రేపుతోంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతాదళం.. 49 డ్రోన్లను కూల్చివేసింది. 2022...
News

సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం

కేంద్ర ప్రభుత్వం ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)’ అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్నవారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా...
News

కుటుంబ వ్యవస్థతోనే సమాజ ఉన్నతి

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా మే 15న విశ్వవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సమాజంలో మానవ, కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయి. సమాజంలో అనేక అవాంఛిత ధోరణులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను వివరించడం కోసం ఈ రోజును అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలం మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. కుటుంబాల్లో పెద్దల సంరక్షణలో పిల్లలు సురక్షితంగా, ఆనందంగా ఉండేవారు. కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధు మిత్రులతో ఒంటరితనం అనే భావన లేకుండా ఆనందంగా గడిపేవారు. కానీ నేడు, ఉమ్మడి కుటుంబాలనేవే లేకుండాపోయాయి. ఆధునిక ప్రపంచంలో చిన్న కుటుంబాలుగా మారాయి. నేడు ఉమ్మడిగా రెండు కుటుంబాలు కాదు కదా, రెండు మనసులు కూడా కలిసి జీవించలేని పరిస్థితి...
News

22న సింహగిరిపై వైభవంగా నృసింహ జయంతి

వైశాఖ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన అప్పన్న ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సింహగిరిపై అధికారులతో ఆయన సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈసారి చతుర్దశి...
News

ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో ప్ర‌ధాని పూజ‌లు

ప్ర‌ధాని మోదీ ఇవాళ వార‌ణాసిలో లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న గంగా న‌ది తీరంలో ఉన్న ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌ల మ‌ధ్య ఆయ‌న గంగా హార‌తి నిర్వ‌హించారు. ప్ర‌ధాని మోదీతో పూజారి రామ‌ణ్ పూజ‌లు చేయించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దేశ ప్ర‌ఖ్యాత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెలిగిపోవాల‌ని కోరుకున్న‌ట్లు పూజారి రామ‌ణ్ వెల్ల‌డించారు.ద‌శాశ్వ‌మేథ ఘాట్‌లో పూజ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌.. ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేక క్రూయిజ్ బోట్‌లో విహ‌రించారు. సోమ‌వారం రాత్రి ప్ర‌ధాని మోదీ.. కాశీ విశ్వేశ్వ‌రుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఇవాళ ఆయ‌న నామినేష‌న్ ఫైల్ చేయ‌డానికి ముందు కాల‌భైర‌వుడిని కూడా ద‌ర్శించుకున్నారు....
ArticlesNews

అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, వివేకాన్ని, జ్ఞానాన్ని కలిగించిన వారు శ్రీ విద్యారణ్యులు

( మే 14 - విద్యారణ్యుల జయంతి ) ఏకశిలానగరం (నేటి వరంగల్‌) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం.శృంగేరి పీఠాధిపతి వీరికి సన్యాసదీక్ష ఇచ్చారు. మాధవులకు విద్యారణ్యులని ఆశ్రమనామం ఇచ్చారు. ఒకసారి శృంగేరి పీఠాధిపతి భారతి తీర్థ శిష్యులను వారి వారి జీవిత లక్ష్యాలను చెప్పమన్నారు. అందరూ రకరకాలుగా చెప్పారు. విద్యారణ్యులు దేశ, ధర్మాలను రక్షించడమే తన లక్ష్యమని, దానికోసమే తన జీవితాన్ని సమర్పిస్తానని చెప్పారు.విద్యారణ్యులు కాశీయాత్ర ముగించుకుని, హంపి చేరి తీవ్ర తపస్సు చేసారు. మొగలాయి దండయాత్రలు, ఆగడాలతో దక్షిణ భారతదేశం అతలాకుతలమయింది. శ్రీరంగం, మధుర మొదలయిన ప్రధాన దేవాలయాలతో సహా అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అనేకమంది హిందువులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడ్డారు.ఈ పరిస్థితులు...
News

కౌంటర్లు, క్యూలైన్ల తనిఖీ చేసిన ఈవో

విజయవాడ దుర్గగుడిలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సేవలపై ఈవో కేఎస్ రామరావు సోమవారం ఆరా తీశారు. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్లు, క్లోక్ రూమ్ లు, చెప్పుల స్టాండ్లను తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తరఫున సిబ్బందితో మాట్లాడారు. భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వైపు గాలిగోపురం నుంచి క్యూలైన్ మార్గంలోకి ప్రవేశించిన ఈవో మార్గమధ్యలో భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఇబ్బందులపై ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో కూలర్లు, మంచినీటి సదుపాయంతో పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమైనా వసతులు కల్పిస్తే బాగుంటుందని బావిస్తు న్నారా అని అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచే అమ్మవారి అన్న...
News

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టిటిడి ఈరోజు నిర్వహించింది. ఈరోజు ఉదయం...
1 1,487 1,488 1,489 1,490 1,491 3,061
Page 1489 of 3061