News

కౌంటర్లు, క్యూలైన్ల తనిఖీ చేసిన ఈవో

323views

విజయవాడ దుర్గగుడిలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సేవలపై ఈవో కేఎస్ రామరావు సోమవారం ఆరా తీశారు. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్లు, క్లోక్ రూమ్ లు, చెప్పుల స్టాండ్లను తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తరఫున సిబ్బందితో మాట్లాడారు. భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వైపు గాలిగోపురం నుంచి క్యూలైన్ మార్గంలోకి ప్రవేశించిన ఈవో మార్గమధ్యలో భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఇబ్బందులపై ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో కూలర్లు, మంచినీటి సదుపాయంతో పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమైనా వసతులు కల్పిస్తే బాగుంటుందని బావిస్తు న్నారా అని అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచే అమ్మవారి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నామని వెల్లడిం చారు. దర్శనం అనంతరం అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించాల్సిందిగా భక్తులకు సూచించారు. అన్న ప్రసాదం పంపిణీపై పదే పదే మైక్ అనౌన్స్ చేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు ఏ విధమైన కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆలయ సిబ్బందికి సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.