విజయవాడ దుర్గగుడిలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సేవలపై ఈవో కేఎస్ రామరావు సోమవారం ఆరా తీశారు. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్లు, క్లోక్ రూమ్ లు, చెప్పుల స్టాండ్లను తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తరఫున సిబ్బందితో మాట్లాడారు. భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వైపు గాలిగోపురం నుంచి క్యూలైన్ మార్గంలోకి ప్రవేశించిన ఈవో మార్గమధ్యలో భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఇబ్బందులపై ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో కూలర్లు, మంచినీటి సదుపాయంతో పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమైనా వసతులు కల్పిస్తే బాగుంటుందని బావిస్తు న్నారా అని అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచే అమ్మవారి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నామని వెల్లడిం చారు. దర్శనం అనంతరం అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించాల్సిందిగా భక్తులకు సూచించారు. అన్న ప్రసాదం పంపిణీపై పదే పదే మైక్ అనౌన్స్ చేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు ఏ విధమైన కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆలయ సిబ్బందికి సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
350views
You Might Also Like
భారత్లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు
47
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశీ అక్రమ వలసదారుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. అరెస్ట్ల భయంతో అక్రమ వలసదారులు అల్లాడిపోతున్నారు. ఈ...
వెంకటేశ్వర స్వామి కీర్తనలను అవమానించడం హిందూ సమాజాన్ని కించపరచడమే: VHP
58
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంకీర్తనలు, భక్తి గీతాలను రాజకీయ విమర్శలకు అనుగుణంగా వ్యంగ్యంగా ఉపయోగించడం హిందూ ద్రోహ చర్య అని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం...
సంధ్యావందనం ఎందుకంటే..
30
మన సనాతన ధర్మంలో నిత్యం ఆచరించాల్సిన పవిత్ర విధి సంధ్యావందనం. పగలు, రాత్రి కలిసే సంధి సమయాల్లో చేసే ప్రార్థన ఇది. ‘సంధ్యాయాం వందనం’ అన్నారు. అంటే...
సీబీఎస్ఈ పుస్తకాల్లో మణిపుర్ అమ్మాయి జీవితగాథ- ఎందుకో తెలుసా?
30
పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వయస్సులో పనిలేదని ఓ అమ్మాయి నిరూపించింది. ఈశాన్య భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో...
నాటి రామాయణం నేటి గ్రామాయణం
లంకా విజయానంతరం రామచంద్రుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా జేసికొని కోసలరాజ్యాన్ని నవ్యంగా భవ్యంగా పాలించాడు. ఆ మహారాజు ధ్యేయం ప్రజల కష్టాలను పారద్రోలడం. రామరాజ్యములో ప్రజలందరూ ఆనంద హృదయార...
శబరిమల పంపా నదిలో ఇక ‘నో డంపింగ్’!
47
శబరిమల యాత్ర నేపథ్యంలో పరమపవిత్రంగా భావించే పంపా నది కాలుష్య కూపంగా మారడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు...




