విజయవాడ దుర్గగుడిలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సేవలపై ఈవో కేఎస్ రామరావు సోమవారం ఆరా తీశారు. ఆలయ ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్లు, క్లోక్ రూమ్ లు, చెప్పుల స్టాండ్లను తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ తరఫున సిబ్బందితో మాట్లాడారు. భక్తుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరో వైపు గాలిగోపురం నుంచి క్యూలైన్ మార్గంలోకి ప్రవేశించిన ఈవో మార్గమధ్యలో భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఇబ్బందులపై ఆరా తీశారు. వేసవి నేపథ్యంలో కూలర్లు, మంచినీటి సదుపాయంతో పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమైనా వసతులు కల్పిస్తే బాగుంటుందని బావిస్తు న్నారా అని అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఉదయం 10.30 గంటల నుంచే అమ్మవారి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నామని వెల్లడిం చారు. దర్శనం అనంతరం అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించాల్సిందిగా భక్తులకు సూచించారు. అన్న ప్రసాదం పంపిణీపై పదే పదే మైక్ అనౌన్స్ చేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు ఏ విధమైన కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆలయ సిబ్బందికి సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
380views
You Might Also Like
12 వేల మందికి అమరనాథ్ తొలి దర్శనం
33
కట్టుదిట్టమైన భద్రత... వాతావరణ అవాంతరాల మధ్య ... హర హర మహాదేవ్ అంటూ... బయల్దేరిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్ మంచుశివలింగ తొలి దర్శనమైంది. అమరనాథ్యాత్రలో భాగంగా...
23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం!
36
పాకిస్థాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. వీరిలో జైష్-ఎ-మహ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో...
జీవిత సవాళ్లను ఎదుర్కొనే ఆచరణాత్మక మార్గదర్శి భగవద్గీత
జీవితంలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనడానికి మన ఆలోచనలను, ప్రవర్తనను సరైన దిశలో మలచుకోవడం ఎలా అన్నదానికి ఆచరణాత్మక మార్గదర్శిగా నిలిచేది భగవద్గీత. ప్రతి మనిషీ తన జీవితంలో...
ప్రకృతి, పురాణ విశ్వాసం కలిసిన అరుదైన అద్భుతం అమర్నాథ్
59
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన ప్రతిసారి భక్తుల్లో ఒక ప్రశ్న తప్పక తలెత్తుతుంది. గుహలోని మంచు శివలింగం ఏటా సహజంగా ఎలా ఏర్పడుతుందన్నదే ఆ ప్రశ్న. కోట్లాది మంది...
సకల జీవుల్లో దైవత్వం.. భారతీయ సంస్కృతి సందేశం
భారతీయ సనాతన ధర్మంలో ప్రకృతి, పశుపక్ష్యాదులు, సమస్త జీవరాశి పట్ల అపార గౌరవం వ్యక్తమవుతుంది. దేవుడు కేవలం ఆలయాల్లోనే కాదు, సృష్టిలోని ప్రతి జీవిలోనూ కొలువై ఉన్నాడనే...
ఉగ్రవాదాన్ని విడనాడే వరకు.. సింధు జలాలు వదిలేది లేదు: భారత్
37
సింధు జలాల్లో తమ వాటా ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా...




