తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకుడు కొమర్రాజు లక్ష్మణరావు
(మే 18 - కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి) తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగులో చరిత్ర పరిశోధనలు, విజ్ఞాన రచనలు చేయడానికి తొలి అడుగులు వేసినవారు. నిద్రాణమై ఉన్న తెలుగు జాతిని మేల్కొలిపిన మహనీయుల్లో ఎన్నదగిన వారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు క్రీ.శ. 1876 మే 18న ఉమ్మడి కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు.విద్యార్థిగా ఉన్నపుడు 'సమాచార్','వివిధ విజ్ఞాన్ విస్తార్' వంటి మరాఠి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. 'కేసరి', 'మహారాష్ట్ర' వంటి పత్రికలకు విరివిగా వ్యాసాలు రాశారు. అనేక చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగులో 'జనరంజని' పత్రిక స్వయంగా నడిపించారు. విజయవాడలో స్త్రీ విద్యావ్యాప్తి 'తెలుగు జనానా' పత్రికలో సోదరి బండారు అచ్చమాంబతో కలిసి అనేక రచనలు చేశారు. హైదరాబాదులోని 'శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం' స్థాపించడంలోనూ;...




