
మదనపల్లె మండలంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం జరగనున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ఈరోజు మదనపల్లెలో పర్యటిస్తారు. శిబిరంలో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు నాయకులు తెలిపారు. శిక్షణ శిబిరంలో దేశభక్తి, కర్రసాము, యోగ, దేశంపై చర్చ కార్యక్రమలు జరగనున్నాయన్నారు. శనివారం నుంచి 20 రోజుల పాటు ఈ శిబిరం జరుగుతుందని వారు పేర్కొన్నారు. మోహన్ భగవత్ మదనపల్లెకు రానున్న నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. మోహన్ భగవత్కు జడ్ప్లస్ క్యాటగిరి సెక్యూరిటి ఉన్న నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారులు అప్రమత్తమై శ్రీ వేద పాఠశాలలో తనిఖీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.





