హైందవ శంఖారావంలో అలరించిన కార్యక్రమాలు
దేవాలయాలలోని పవిత్ర సాత్విక వాతావరణాన్ని ప్రతిఫలించేలా, హిందువుల స్వాభిమానం జాగృతమయ్యేలా, అష్టదిక్కులూ పిక్కటిల్లేలా సాధుసంతుల శంఖనాదంతో ‘హైందవ శంఖారావం’ కార్యక్రమం ప్రారంభమైంది. వేద పండితులు మంగళాశీర్వచనాలు అందజేస్తుండగా గోవింద దేవగిరి మహరాజ్ స్వామీజి జ్యోతిప్రజ్వలనంతో కార్యక్రమాన్ని శుభారంభం చేసారు. జ్యోతిప్రజ్వలనం తర్వాత...














