దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా ప్రారంభమైంది.
ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా ప్రజలు బహిరంగ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా చేరుకోసాగారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచీ సభలో పాల్గొనడానికి వివిధ మార్గాల్లో వస్తున్న వారంతా క్రమంగా తమకు కేటాయించిన స్థానాల్లోకి చేరుకుంటున్నారు.
ఉదయం 9 గంటల నుంచీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామ, శ్రీకృష్ణ, పరమ శివ స్తుతులతో కూడిన ప్రార్థనాగీతాలు, భజనలతో గీతాలాపనలు, నాట్యప్రదర్శనలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హైందవ శంఖారావం ధ్యేయగీతం (థీమ్ సాంగ్) ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది.
ఇస్కాన్ విజయవాడ వారు ఇటీవలి గీతాజయంతి సందర్భంగా భగవద్గీత ప్రచారం కోసం ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ గీతాన్ని హైందవ శంఖారావం వేదికగా ఆవిష్కరించారు.
యువతలో శ్రీకృష్ణుడి స్ఫూర్తిని నింపుతూ ధార్మిక పరిరక్షణకు అంకితం కావలసిన బాధ్యతను గుర్తుచేస్తూ సాగిన గీతం సభలో పాల్గొంటున్న ప్రేక్షకులనే కాక టీవీ, సోషల్ మీడియా ద్వారా హైందవ శంఖారావం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరినీ ఉత్తేజితులను చేసింది.
పాకిస్థాన్లో భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదుల ఏరివేత పరంపర కొనసాగుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు జరుపుతున్న దాడుల్లో కీలక ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు హతమవుతున్నారు....
ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత అనేది కేవలం ప్రభుత్వాల పనే కాదని ,అది ప్రతి పౌరుడిపైనా వుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచించారు. భారత్ ప్రస్తుతం...
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ 15, 2026న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆధ్వర్యంలో 'యువ కుంభ్' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. వామపక్ష...
అచ్చెరువొందె నిర్మాణాలు, అపురూప కట్టడాలు, ఔరా! అనిపించే చారిత్రక, ఆథ్యాత్మిక స్థలాలు! ఇలాంటివి వారసత్వ చిహ్నాలు. తరతరాలుగా వస్తున్న చెక్కుచెదరని ఈ సంపదను భవిష్యత్ తరాలకు అందించడాన్నే...
విశ్వహిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు దిల్సుఖ్నగర్లో లవ్ జిహాద్కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ జాతీయ అధికార...