NewsProgramms

హైందవ శంఖారావం హైలెట్స్

400views
  • దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా ప్రారంభమైంది.
  • ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా ప్రజలు బహిరంగ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా చేరుకోసాగారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచీ సభలో పాల్గొనడానికి వివిధ మార్గాల్లో వస్తున్న వారంతా క్రమంగా తమకు కేటాయించిన స్థానాల్లోకి చేరుకుంటున్నారు.
  • ఉదయం 9 గంటల నుంచీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామ, శ్రీకృష్ణ, పరమ శివ స్తుతులతో కూడిన ప్రార్థనాగీతాలు, భజనలతో గీతాలాపనలు, నాట్యప్రదర్శనలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హైందవ శంఖారావం ధ్యేయగీతం (థీమ్ సాంగ్) ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది.
  • ఇస్కాన్ విజయవాడ వారు ఇటీవలి గీతాజయంతి సందర్భంగా భగవద్గీత ప్రచారం కోసం ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ గీతాన్ని హైందవ శంఖారావం వేదికగా ఆవిష్కరించారు.
  • యువతలో శ్రీకృష్ణుడి స్ఫూర్తిని నింపుతూ ధార్మిక పరిరక్షణకు అంకితం కావలసిన బాధ్యతను గుర్తుచేస్తూ సాగిన గీతం సభలో పాల్గొంటున్న ప్రేక్షకులనే కాక టీవీ, సోషల్ మీడియా ద్వారా హైందవ శంఖారావం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరినీ ఉత్తేజితులను చేసింది.