దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని, హిందువులే తమ దేవాలయాలను నిర్వహించుకోవాలనే లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభ వైభవంగా ప్రారంభమైంది.
ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా ప్రజలు బహిరంగ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా చేరుకోసాగారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచీ సభలో పాల్గొనడానికి వివిధ మార్గాల్లో వస్తున్న వారంతా క్రమంగా తమకు కేటాయించిన స్థానాల్లోకి చేరుకుంటున్నారు.
ఉదయం 9 గంటల నుంచీ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామ, శ్రీకృష్ణ, పరమ శివ స్తుతులతో కూడిన ప్రార్థనాగీతాలు, భజనలతో గీతాలాపనలు, నాట్యప్రదర్శనలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హైందవ శంఖారావం ధ్యేయగీతం (థీమ్ సాంగ్) ఆహూతులను అమితంగా ఆకట్టుకుంది.
ఇస్కాన్ విజయవాడ వారు ఇటీవలి గీతాజయంతి సందర్భంగా భగవద్గీత ప్రచారం కోసం ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ గీతాన్ని హైందవ శంఖారావం వేదికగా ఆవిష్కరించారు.
యువతలో శ్రీకృష్ణుడి స్ఫూర్తిని నింపుతూ ధార్మిక పరిరక్షణకు అంకితం కావలసిన బాధ్యతను గుర్తుచేస్తూ సాగిన గీతం సభలో పాల్గొంటున్న ప్రేక్షకులనే కాక టీవీ, సోషల్ మీడియా ద్వారా హైందవ శంఖారావం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరినీ ఉత్తేజితులను చేసింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో ‘స్మార్ట్ బోర్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6 వేల కి.మీ....
ఉగ్రవాదానికి తమ దేశం కేంద్రం కాదని పాకిస్థాన్ చెప్పే మాటలు మరోసారి నీటిమూటలయ్యాయి. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు పాకిస్థాన్ సురక్షితమైన అడ్డాగా మారిందన్న ఆరోపణలకు బలం...
అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సిఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) స్పష్టం చేసింది....
చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం ఇరంగారిపల్లి గ్రామ పరిసరాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దామలచెరువు–నేండ్రగుంట రహదారి ఆనుకుని ఉన్న ఓ రైతు పొలంలో జేసీబీతో తవ్వకాలు చేపడుతుండగా...
శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం. అదో విశిష్ట వేదాంత బోధగా వినుతికెక్కింది. అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది. భగవద్గీతను భక్తిశ్రద్ధలతో చదివినవారు, విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు....
తిరుపతి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా చర్లపల్లి–తిరుపతి మధ్య రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీసును కొత్తగా ప్రారంభిస్తున్నట్లు సౌత్...