తెలుగు నాట ” ప్రకృతి వందన “
భారతీయులు అనాదిగా ప్రకృతి ఆరాధకులు. రాయి రప్పా చెట్టు చేమలను, నదీనదాలను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఈ ఆచారాలన్నీ మూఢమైనవని కొందరు విధర్మీయులు మనలను అపహాస్యం చేయడం కూడా మనమెరుగుదుము. నిజానికి భారతీయుల ప్రకృతి ఆరాధన వెనుక మానవ జీవన మనుగడకు ఉపయోగపడే ప్రకృతి సంపదను నాశనం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ తమ మనుగడకు ఉపయోగించుకుని మన భావితరాలకు సైతం సురక్షితంగా అందించాలన్న...









