151
-
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశ వ్యాప్తంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.
అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి మోడీని ఒప్పించానన్నారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను తీర్థ స్థలాలుగా మారుస్తామన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులను కలుస్తామన్నారు. వచ్చే ఏడాది జులై మూడోతేదీ వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. అల్లూరి జీవిత చరిత్రను ప్రజలకు వివరిస్తామన్నారు.
Source: Velugu