
చెన్నై: తమిళనాట కొత్త వివాదం రాజుకుంది. రాజరాజ చోళుడి గురించి ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ మద్దతు తెలపడం వివాదానికి దారితీసింది. దీనిపై పుదుచ్ఛేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సహా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు విమర్శిస్తున్నారు.
రాజరాజ చోళుడి కథను స్ఫూర్తిగా తీసుకుని రాసిన నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్సెల్వన్’ ఇటీవల విడుదలైంది. దీనిపై ఓ కార్యక్రమంలో వెట్రిమారన్ మాట్లాడుతూ.. “రాజరాజ చోళన్ అసలు హిందువే కాదు. కానీ, కొందరు (బీజేపీ) మన గుర్తింపును దోచుకెళ్ళాలని చూస్తున్నారు. ఇప్పటికే తిరువళ్లూర్ను కాషాయీకరించారు. ఇలాంటివి ఏమాత్రం సహించకూడదు” అంటూ వ్యాఖ్యలు చేశారు. వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్ మద్దతు తెలిపారు. రాజరాజ చోళుని కాలంలో అసలు హిందూ మతమే లేదని చెప్పారు. అ కాలంలో కేవలం వైనం, శివం, సమానం మాత్రమే ఉన్నాయన్నారు. తూత్తుకుడిని.. ట్యుటికొరైన్ చేసినట్టు ఈ మూడింటినీ హిందూగా వారు పిలిచేవారని తెలిపారు.





