
33views
బెంగళూరు : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ శుక్రవారం ఉదయం బెళగావిలో ప్రారంభమైంది.ఈ బైఠక్ లో ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, సహ సర్ కార్యవాహలు, ఆయా కార్య విభాగాల ప్రముఖులు, కార్యకారిణి సదస్యులు, క్షేత్ర ప్రచారకులు, సహ క్షేత్ర ప్రచారకులు హాజరయ్యారు. అలాగే ఆరెస్సెస్ ప్రేరేపిత వివిధ సంస్థల నుంచి అఖిల భారతీయ సంఘటనా మంత్రులు కూడా హాజరయ్యారు. 46 రాష్ట్రాలకు చెందిన ప్రాంత ప్రచారకులు, సహ ప్రాంత ప్రచారకులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో మార్చి 2026 నుంచి సంఘ్ వివిధ స్థాయిలలో నిర్వహించిన ప్రశిక్షణ వర్గల గురించి, శాఖ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికల అమలుపై సమగ్ర చర్చ జరుగుతుంది. అలాగే సంఘ కార్య శతాబ్ది సందర్భంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, విస్తరణతో పాటు శాఖా విస్తరణ గురించి కూడా చర్చిస్తారు. నిత్య శాఖలను మరింత విస్తరించడానికి ప్రణాళికలను కూడా చర్చకు వస్తాయి.

వీటితో పాటు కార్య శతాబ్ది సందర్భంగా ఇప్పటికే పూర్తైన కార్యక్రమాలపై కూడా ఈ సమావేశాల్లో సమీక్షిస్తారు. అలాగే సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ముందుగా యోజన చేసిన కార్యక్రమాల సమీక్ష, ప్రణాళికపై కూడా చర్చిస్తారు. అలాగే 2026-2027 కి గాను సర సంఘచాలక్ పర్యటన వివరాలపై కూడా చర్చిస్తారు.





