News

పాకిస్తాన్‌లో వరుసగా మృతి చెందుతున్న భారత ఖైదీలు… కేంద్రం ఆందోళన

443views

న్యూఢిల్లీ: గత తొమ్మిది నెలల వ్యవధిలో పాకిస్తాన్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు ఖైదీలు మృతి చెందడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. మృతుల్లో ఐదుగురు మత్స్యకారులే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు.

ఈ అంశాన్ని పాకిస్తాన్‌ వద్ద లేవనెత్తినట్టు వెల్లడించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అయితే, వీరంతా పాకిస్తాన్‌లో శిక్షను పూర్తి చేసుకున్నవారేనని తెలిపారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ ఖైదీలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ దేశానిదేనని గుర్తుచేశారు. అలాగే, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల పాకిస్తాన్ యూఎస్‌ రాయబారి డొనాల్డ్‌ బ్లోమే పర్యటనపై అభ్యంతరాలను అమెరికాకు తెలిపామన్నారు. పీవోకేలో ఆయన సమావేశాలు నిర్వహించడం పట్ల కూడా అభ్యంతరం చెప్పినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి