News

జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల ఘాతుకం!

542views
  • పోలీసు అధికారిని కాల్చి చంపిన ముష్కరులు

జ‌మ్మూక‌శ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్​లోని బాటమలూలో కానిస్టేబుల్​పై(29) కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్​ను స్థానికంగా ఉన్న ఎస్​ఎంహెచ్​ఎస్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనను వివిధ పార్టీలు ఖండించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి