News

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు

363views

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను పాకిస్తాన్‌కు విక్రయిస్తున్నట్టు బైడెన్‌ యంత్రాంగం తెలిపింది. తమ చర్య దక్షిణాసియాలో సమతౌల్యాన్ని దెబ్బతీయదంటూ ముక్తాయింపు ఇచ్చింది.

ఎఫ్​-16ల సామర్ధ్యం ఏమిటో.. వాటిని పాక్‌ ఎక్కడ వాడుతుందో అందరికీ తెలుసని.. ఈ విషయంలో ఎవరినీ ఫూల్స్‌ చేయలేరని జైశంకర్ అన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ విధానాలను రూపొందించే వారితో మాట్లాడాల్సి వస్తే.. మీరు ఏం చేస్తున్నారని అని అడుగుతానని జైశంకర్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి