News

కుల్గాంలో ఎన్‌కౌంటర్… ముగ్గురు తీవ్రవాదుల హ‌తం!

386views

కుల్గాం: జమ్ముకశ్మీర్​, కుల్గాం జిల్లాలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను భ‌ద్ర‌తాద‌ళాలు మట్టుబెట్టాయి బలగాలు. మిషిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో మంగళవారం నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో బలగాలపై ముష్కరులు కాల్పులకు పాల్పడగా.. ఎన్​కౌంటర్​కు దారి తీసింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని సైనికాధికారులు తెలిపారు. ఆపరేషన్​ కొనసాగుతున్నట్టు తెలిపారు. మరోవైపు.. అనంత్​నాగ్​ జిల్లాలోని హంగల్​గుండ్​ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగినట్టు చెప్పారు. హిజ్బుల్​ ముజాహిద్దీన్​కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు. భద్రతా దళాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి