
రాష్ట్ర సేవికా సమితి
అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు.
సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026
తీర్మానం: జనాభా అసమతుల్యత: జాతీయ సంక్షోభం
ఏ దేశ భవిష్యత్తు అయినా దాని జనాభాపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, జనాభా అసమతుల్యత అనేది ఒక తీవ్రమైన మరియు సున్నితమైన సమస్య. భారతదేశంలో జనాభాను నియంత్రించడానికి అనేక దశాబ్ధాలుగా అమలు చేసిన వివిధ చర్యలు జనాభా పెరుగుదల రేటును గణనీయంగా తగ్గించాయి. అయితే, జనాభా కేవలం ఒక గణాంకం కాదు; అది ఒక సమాజం యొక్క గుర్తింపు. భారతదేశంలో పెరుగుతున్న జనాభా అసమతుల్యత దాని గుర్తింపును నాశనం చేయడమే కాకుండా, దాని ఉనికికే ముప్పుగా పరిణమిస్తోంది. హిందూ జీవన తత్త్వస్ఫూర్తితో అభివృద్ధి చెందిన అన్ని మతాల పట్ల గౌరవం మరియు వసుధైవ కుటుంబకం వంటి సద్గుణాలతో భారతదేశానికి గుర్తింపు ఉంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ ప్రకారం, 1951లో 84.68 శాతంగా ఉన్న హిందూ జనాభా 2015 నాటికి 78.06 శాతానికి తగ్గింది. ముస్లిం జనాభా 1950లో 9.84 శాతం నుండి 2015 నాటికి 14.09 శాతానికి పెరిగింది. ఇతర సమూహాలలో వృద్ధి నామమాత్రంగానే ఉంది. వివిధ వర్గాల జనాభా నిష్పత్తులలో వస్తున్న మార్పులను బట్టి చూస్తే, జనాభా నియంత్రణ విధానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది. హిందూ జనాభా క్షీణించిన రాష్ట్రాలను చూడటం ద్వారా భవిష్యత్తును సులభంగా ఊహించవచ్చు. మొత్తం కాశ్మీర్ లోయ, బెంగాల్, బీహార్, కేరళలోని కొన్ని జిల్లాలు మరియు అస్సాంలోని ముస్లిం-మెజారిటీ జిల్లాలలో మత సామరస్యం కుప్పకూలింది. ఈ అసమతుల్యత అప్పటికే భారతదేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించి, 1947లో భారతదేశ విభజనకు దారితీసింది.
జనాభా అసమతుల్యత నిర్దిష్ట ప్రాంతాలలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, భాష మరియు సామాజిక సామరస్యంపై ప్రభావం చూపుతుంది. భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లోకి రోహింగ్యాలు మరియు బంగ్లాదేశీయుల అక్రమ చొరబాటు కూడా ఈ అసమతుల్యతకు ఒక ప్రధాన కారణం. ఇది స్థానిక పౌరుల ఉపాధి, భూమి మరియు సహజ వనరులపై ప్రభావం చూపుతుంది. జనాభా అసమతుల్యత అంతర్గత భద్రత మరియు సార్వభౌమాధికారానికి ముప్పును పెంచుతుంది. అంతేకాకుండా, సంఖ్యాపరమైన ప్రభావాన్ని పెంచుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు జనాభా అసమతుల్యతను మరింత పెంచుతున్నాయి. మతమార్పిడి మరియు లవ్ జిహాద్ కూడా జనాభా అసమతుల్యత నిష్పత్తిలో మార్పుకు కారణాలుగా పరిగణించబడుతున్నాయి.
ఇది ఒక సున్నితమైన విషయం, దీని పరిష్కారం గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ జనాభా అసమతుల్యత పట్ల హిందూ సమాజం కూడా మేల్కొనాలి. నేడు, ఉన్నత విద్యావంతులైన హిందూ యువత ఆర్థిక లాభం కోసం కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, పిల్లల పెంపకం బాధ్యతలను తప్పించుకోవడం, పిల్లలు కనకపోవడం లేదా ఒక్క బిడ్డను మాత్రమే కనడం వంటి అనేక కారణాలు జనాభా క్షీణతకు దోహదపడుతున్నాయి. అంతేకాకుండా, ప్రభుత్వ విధానాల కారణంగా కొన్ని వర్గాలు పిల్లల జననాన్ని తగ్గిస్తుండగా, మరికొన్ని వర్గాల వారు ఒకటి కంటే ఎక్కువసార్లు వివాహం చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. ఇది కూడా జనాభా అసమతుల్యతకు ఒక కారణం. సమాజంలో కుల వివక్షను సృష్టించడం, మత మార్పిడులను ప్రోత్సహించడం, హిందువులుగా గుర్తించుకోవడానికి నిరాకరించడం, మాతృత్వాన్ని పురోగతికి అడ్డంకిగా భావించడం మరియు “డింక్” కుటుంబం (Double income no kids) వంటివి కూడా జనాభా అసమతుల్యతకు దోహదపడే అంశాలు. నేడు భారతదేశం ఒక యువ దేశం. రాబోయే 50 ఏళ్లలో, ఈ జనాభా వృద్ధాప్యానికి చేరుకుంటుంది. పిల్లలు పుట్టకపోతే, భారతదేశ యువ జనాభా తగ్గిపోతుంది. నేటి యువతకు వారి వృద్ధాప్యంలో అండగా నిలిచే తరం లేకపోవడం కూడా సామాజిక వ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీస్తుంది.
దేశంలో పెరుగుతున్న క్రైస్తవ, ముస్లిం మత మార్పిడులు, లవ్ జిహాద్, చొరబాట్లను అత్యంత కఠినమైన చట్టాలు చేసి తక్షణమే అరికట్టాలని రాష్ట్ర సేవికా సమితి ప్రతినిధి మండలి ప్రభుత్వాన్ని కోరుతోంది. చొరబాట్లను నివారించడానికి సరిహద్దుల్లో కూడా తగిన ఏర్పాట్లు చేయాలి. విదేశీయుల అక్రమ ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలి. వారిని అడ్డుకోవడం, వారిని గుర్తించి, బహిష్కరించడం అన్ని ప్రభుత్వాలకు రాజ్యాంగపరమైన మరియు నైతిక బాధ్యత. గౌరవనీయ సుప్రీంకోర్టుచే నియమించబడిన హజారికా కమిషన్ ఈశాన్య ప్రాంతంలో బంగ్లాదేశీయుల చొరబాటు ఫలితంగా 2047 నాటికి స్థానిక పౌరులు అల్పసంఖ్యాకులుగా మారిపోతారని స్పష్టంగా పేర్కొంది. హిందువుల పట్ల జిహాదీల దురాక్రమణ విధానం ఆ ప్రాంతాలలో అసమానతలను వేగంగా పెంచుతోంది.
భవిష్యత్ సవాళ్ల గురించి మన భవిష్యత్ తరాలను మేల్కొల్పి, వారికి సరైన సమయంలో వివాహం, సంతానోత్పత్తి మరియు సామాజిక బాధ్యతల గురించి అవగాహన కల్పించాలని రాష్ట్ర సేవికా సమితి సమాజానికి పిలుపునిస్తోంది. కుల లేదా వర్గ ఆధారిత రాజకీయాలకు బదులుగా, అన్ని వర్గాలలో విద్య, మహిళా సాధికారత మరియు ఆర్థికాభివృద్ధి ద్వారా సమాజాన్ని మేల్కొల్పి, సాధికారత కల్పిద్దాం. జనాభా అసమతుల్యతకు గల అన్ని కారణాలను గుర్తించి, ఈ తీవ్ర సంక్షోభం నుండి దేశాన్ని కాపాడటానికి చట్టపరమైన చర్యలు చేపట్టి, మన సామాజిక బాధ్యతలను నెరవేర్చాలి.
భారతదేశంలో జనాభా అసమతుల్యత యొక్క కారణాలు మరియు పరిణామాలపై రాష్ట్ర సేవికా సమితి ప్రతినిధి మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల కోసం ఏకరీతి జాతీయ జనాభా విధానాన్ని(common civil code) అమలు చేయాలని అన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను కోరుతోంది. జనాభా అసమతుల్యత వల్ల తలెత్తే సమస్యలను తొలగించి, భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించే ఏకరీతి పౌర స్మృతిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈ అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి ప్రభుత్వాన్ని కోరుతోంది.



