News

హిజ్బుల్ తీవ్రవాదిని కాల్చి చంపిన సైన్యం

400views

జమ్మూక‌శ్మీర్‌: జమ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు మరణించాడు. ఈ ఎన్‌కౌంట‌ర్ సమయంలో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్‌ను కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు.

“Terrorist Commander of proscribed #terror outfit HM Nisar Khanday killed. #Incriminating materials, #arms & ammunition including 01 AK 47 rifle recovered. #Operation in progress,” అని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. మరణించిన హిజ్బుల్ కమాండర్‌ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఓ ఏకే-47 రైఫిల్‌ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంట‌ర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి