News

అయోధ్య రామ మందిర గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన

567views

అయోధ్య‌: ఉత్తర​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. బుధవారం ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు​. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను సత్కరించారు. దేశవ్యాప్తంగా మునులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు అయోధ్య హనుమాన్​గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

2023 డిసెంబర్​లోగా ఆలయ గర్భగుడి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది రామాలయ పనులు చూసుకుంటున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​. 2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్​ నృపేంద్ర మిశ్రా తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి