News

ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు!

479views
  • బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ

అమ‌రావ‌తి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మత‌మార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయని, హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు.

రాష్ట్రంలోని ఏడు ప్రధాన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళామ‌ని, నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై అటాక్ జ‌రిగింద‌ని, ఆత్మకూరులో హిందువుల ప్రాంతంలో మసీదు ఎందుకు కడుతున్నారని అడిగితే తమ జిల్లా ప్రెసిడెంట్‌పై దాడి చేశారన్నారు.

తెనాలిలో హిందూ మహిళని వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. శ్రీశైలంలో అన్యమత మతస్థులు అత్యధికంగా దుకాణాలు, ఇతరత్రా కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కాకినాడ జేఎన్‌టీయులో ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్‌పై గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళామ‌ని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి