News

భాగ్య‌న‌గ‌రంలో నలుగురు ఉగ్రవాదుల రెక్కీ!

378views

భాగ్య‌న‌గ‌రం: తెలుగు రాష్ట్రం భాగ్య‌న‌గ‌రంలో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించారు. ఈ మేర‌కు హరియాణా పోలీసులు త‌మ‌ విచారణతో గుట్టు ర‌ట్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కీలకాంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.

మహారాష్ట్ర లోని నాందేడ్‌లో వీరు నాలుగు రోజులపాటు మకాం వేసినట్టు పోలీసులు చెప్పారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ రెండోతేదీ వరకు ఉగ్రవాదులు నాందేడ్‌లో ఉన్నారని, అక్కడి నుంచి బీదర్‌ మీదుగా గోవాకు వెళ్ళార‌ని పోలీసులు కూపీ లాగారు. వీరంతా ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్‌ హర్వీందర్‌ సింగ్‌ రింధా అనుచరులని పోలీసులు చెబుతున్నారు.

పాకిస్తాన్ నుండి డ్రోన్‌ల ద్వారా ఫిరోజ్‌పూర్ ఫీల్డ్‌లో పడిపోయిన పేలుడు పదార్థాలను పంపిణీ చేయడానికి తెలంగాణకు వెళుతున్న నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. హర్యానా, పంజాబ్ పోలీసులు గత వారం ఈ జాయింట్ ఆపరేషన్ జ‌రిపారు. వారు ప్రయాణిస్తున్న వాహనం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

“వారు తీవ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న రిండాతో టచ్‌లో ఉన్నారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలను అందించడానికి వారికి యాప్ ద్వారా లొకేషన్‌లను పంపేవారు. రిండా డ్రోన్‌ల సహాయంతో ఫిరోజ్‌పూర్‌లోని పొలాల్లో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పడవేసేవారు. వారు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారో మేము నిర్ధారిస్తున్నాము, ”అని కర్నాల్ పోలీసు సూపరింటెండెంట్ గంగా రామ్ పునియా గత వారం చెప్పారు.

వీరు హైదరాబాద్‌లో కూడా తిరిగారని జన సంచారం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ భయాందోళన‌లు సృష్టించే విధంగా పథకం రూపొందించాలని కుట్ర పన్నినట్టు హరియాణా పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో వీరు సంచరించారన్న అంశంపై నగర పోలీసులతో పాటు సీఐడీ, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఐడీ, ఇంటలి జెన్స్‌ పోలీసులు దృష్టి సారించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి