News

కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం!

578views

కశ్మీర్​: జమ్ముకశ్మీర్ అనంతనాగ్​ జిల్లా పహల్గాం అట‌వీ ప్రాంతంలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు నిర్వహించాయి బలగాలు. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో అశ్రఫ్​ మోల్పీ అనే పాత తీవ్రవాది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అమర్​నాథ్ యాత్ర మార్గంలో జరిగిన ఎన్​కౌంటర్ తమకు అతిపెద్ద విజయం అని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్ తెలిపారు.

సరిహద్దులో 200 మంది ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​లో చొరబడేందుకు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దులో నక్కి ఉన్నట్టు ఉత్తర ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. అయితే, గతంతో పోల్చితే ఉగ్రవాద చొరబాట్లు భారీగా తగ్గాయని తెలిపారు. అలాగే 2021 ఫిబ్రవరి నుంచి ఇరుదేశాల అంగీకారం ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం కూడా పకడ్బందీగా అమలవుతోందని చెప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి