News

భోపాల్‌లో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల అరెస్టు

569views

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని రెండు ప్రాంతాలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎంపీ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఏ-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందిన నలుగురిని అధికారులు అరెస్టు చేసిన‌ట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఫజర్ అలీ, ఎండీ అక్వీల్, జహూరుద్దీన్, ఫజార్ జైనుల్‌గా గుర్తించినట్టు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. అందరూ బంగ్లాదేశ్‌కు చెందినవారే. నిందితుల వద్ద నుండి జిహాదీ సాహిత్యం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, అనుమానాస్పద పత్రాలతో సహా నేరారోపణ అంశాలు స్వాధీనం చేసుకున్నారు. కార్యకర్తలు రిమోట్ ఆధారిత స్లీపర్ సెల్‌ను సిద్ధం చేశారని, ఇది దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రసారం చేయడానికి ఉద్దేశించబడింద‌ని పోలీసులు తెలిపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి