
500views
-
సంతాపం తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాలోని ఒంటారియో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాసింజర్ వ్యాన్.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను హర్ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కరణ్పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్కుమార్గా అక్కడి పోలీసులు గుర్తించారు.
క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు కెనడాలోని భారత రాయబారి అజయ్ బిసారియా తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. బాధితుల స్నేహితులను సంప్రదించి.. సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది.





