News

పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత

220views
  • నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న భద్రత దళాలు

పంజాబ్‌: పంజాబ్‌లోని ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్​ డ్రోన్​ను భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) కూల్చివేసింది. అందులో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో డ్రోన్​ శబ్దానికి అప్రమత్తమై దానిని గురిపెట్టేందుకు పారా బాంబులను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేసినట్టు బీఎస్​ఎఫ్​ అధికార ప్రతినిధి తెలిపారు. డ్రోన్​కు ఓ చిన్న ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు ప్యాకెట్​ ఉన్నాయని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి