220
-
నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న భద్రత దళాలు
పంజాబ్: పంజాబ్లోని ఫిరోజ్పుర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్ డ్రోన్ను భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) కూల్చివేసింది. అందులో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
తెల్లవారుజామున మూడు గంటల సమయంలో డ్రోన్ శబ్దానికి అప్రమత్తమై దానిని గురిపెట్టేందుకు పారా బాంబులను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేసినట్టు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. డ్రోన్కు ఓ చిన్న ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు ప్యాకెట్ ఉన్నాయని వెల్లడించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.