News

శ్రీనగర్​​లో ఎన్​కౌంటర్​, ఇద్దరు ముష్కరుల హతం

481views

శ్రీ‌న‌గ‌ర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇక్కడి జకూరా ప్రాంతంలో శ‌నివారం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు దాగి ఉన్నారనే పక్కా సమాచారం మేరకు భద్రతా సిబ్బంది.. జకూరా ప్రాంతానికి చేరుకుని ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

వీరు తీవ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు(ఎల్​ఈటీ)కు చెందిన ఉగ్రవాదులని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఒకరిని ఇఖ్లాక్​ హజామ్​గా గుర్తించారు. హసన్‌పోరా, అనంత్‌నాగ్‌లో ఇటీవల జరిగిన హెచ్‌.సీ అలీ మహ్మద్ హత్యలో హజామ్​ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి నుంచి రెండు పిస్టల్స్​ సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి