
440views
-
ఆరుగురు మావోయిస్టుల మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్గఢ్ పెసపాడు అటవీప్రాంతంలో దాడులు జరిగాయని పేర్కొన్నాయి. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని వివరించాయి.