News

ఛత్తీస్‌గఢ్​లో ఎదురు కాల్పులు

440views
  • ఆరుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్​ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్​ సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎన్​కౌంటర్ జరిగినట్టు పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. కుర్ణవల్లి, ఛత్తీస్‌గఢ్‌ పెసపాడు అటవీప్రాంతంలో దాడులు జరిగాయని పేర్కొన్నాయి. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని వివరించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి