News

ఆగ్రా సేవా భారతి ఆఫీసుపై ముస్లింల దాడి!

650views
  • భారత మాత విగ్రహం ధ్వంసం

  • 13 మందికి గాయాలు

ఆగ్రా: ఆగ్రాలోని సేవా భారతి కార్యాలయంపై స్థానిక ముస్లింలు దాడి చేశారు. ఈ సంఘ‌ట‌న‌లో 13 మంది స్వయంసేవకులు గాయపడ్డారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆదివారం (డిసెంబర్ 26) అర్థరాత్రి ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఆగ్రాలోని మోతీమహల్ ప్రాంతంలో, రాష్ట్రీయ సేవా భారతి కార్యాలయం, డాక్టర్ హెడ్గేవార్ అధ్యయన కేంద్రం ఉంది. ఆఫీసు ముందు రాధాకృష్ణ మందిరం ఉంది. కొందరు స్థానిక ముస్లిం యువకులు ఈ ఆలయంలో నిత్యం మద్యం సేవిస్తున్నారు.

ఎప్ప‌టిలాగే ఆదివారం కూడా కొందరు ముస్లిం యువకులు మద్యం సేవిస్తుండగా, కొందరు స్వయంసేవకులు ఆలయంలో మద్యం సేవించవద్దని కోరారు. మద్యం బాటిళ్లను సేకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అర్థరాత్రి సుమారు 80 మంది ముస్లిం యువకులు సేవాభారతి కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో స్వయంసేవకులు వికాస్ గుప్తా, శివమ్ కుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

కార్యాలయం ఆవరణలో ఉన్న భారత మాత విగ్రహాన్ని అల్లరి మూకలు ధ్వంసం చేశారు. దాడి వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యేలు యోగేంద్ర ఉపాధ్యాయ్, మహేశ్ గోయల్, పురుషోత్తం ఖండేల్వాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆగ్రాలోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ కుమార్ హామీ ఇచ్చారు. ఫిర్యాదు ఆధారంగా కేసుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Source: Organiser

 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి