
506views
-
మావోయిస్టుల దుశ్చర్య
సుక్మా: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. అపహరణకు గురైన వారిలో ఓ మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా కొంటా బ్లాక్లోని క్వాయిల్ గ్రామానికి చెందినవారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం కలిగించి, భయపెట్టేందుకే మావోలు ఇలాంటి చర్యలకు తెగబడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్పై వేగంగా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. గ్రామస్థులను వదిలిపెట్టాలని సర్వా ఆదివాసీ సొసైటీ డిమాండ్ చేసింది.