
561views
-
స్పష్టం చేసిన హోంశాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తిపై జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం కీలక ప్రకటన చేసింది. భారత్లో ఏవై.4.2 వ్యాప్తి 0.1 శాతం కంటే తక్కువ ఉందని, ఆందోళన చెందాల్సినంత వ్యాప్తి లేదని స్పష్టం చేసింది. జీనోమ్ వేరియంట్లపై పర్యవేక్షించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియంను 2020 డిసెంబర్లో ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది.





