
456views
గాంధీనగర్: భారత మత్స్యకారులపై పాకిస్థాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ గుజరాత్ తీరంలోని అంతర్జాతీయ మారిటైం సరిహద్దు రేఖ వద్ద కాల్పులు జరిపింది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన శ్రీధర్ రమేశ్ చమ్రే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల సమయంలో పడవలో ఏడుగురు ఉన్నట్టు దేవ్భూమి ద్వారక ఎస్పీ సునీల్ జోషీ తెలిపారు.
వీరిలో ఐదుగురు గుజరాత్కు చెందినవారు కాగా ఇద్దరు మహారాష్ట్ర జాలర్లని వివరించారు. ఈ ఘటనపై ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) స్పందించింది. కేసు దర్యాప్తులో ఉందని త్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. పడవలోని మరో ఆరుగురు జాలర్లను అరెస్ట్ చేశామన్న పాక్ ప్రకటనను ధ్రువీకరించలేదని పేర్కొంది.





