News

ఏక కాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించిన మోడీ

756views

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధార్థ్​నగర్​లో తొమ్మిది వైద్యకళాశాలలను ప్రారంభించారు. ఈ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవియా, గవర్నర్​ అనందీబెన్​ పటేల్​లు పాల్గొన్నారు. ఏకకాలంలో తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభించడం చిన్న విషయం కాదని, వర్ధమాన, భవిష్యత్తు తరాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర వైద్య శాఖా మంత్రి అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి