470
-
పర్యాటక ప్రాంతాల మూసివేత
-
ఎప్పటిలాగానే వివరాలు దాస్తున్న కిలాడి డ్రాగన్
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ పడగవిప్పుతోంది. ఇప్పటికే వైరస్ను నియంత్రించేందుకు అనేక ఆంక్షలను అమలు చేస్తున్న డ్రాగన్.. తాజాగా ఓ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మూసేసింది. కొత్త కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గాన్సు రాష్ట్రంలోని బౌద్ధ మందిరాలు, ప్రఖ్యాత ప్రార్థనా స్థలాలను మూసేసింది. ఎప్పటి లాగానే చైనా కేసుల విషయంలో దొంగ లెక్కలు చెప్తూ ప్రపంచాన్ని ఏ మారుస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 కొత్త కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆ దేశ జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. ఇందులో నాలుగు గాన్సు నుంచే ఉన్నట్లు తెలిపింది. 19 కేసులు ఇన్నర్ మంగోలియాలో వెలుగుచూసినట్టు పేర్కొంది. దీంతో ఇన్నర్ మంగోలియాలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.