
681views
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి శాలివాహన నగర్లోని ఉర్దూ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. హుస్సేన్ అనే ఉపాధ్యాయుడు పాఠాలు బోధించడం మానేసి, నీలిచిత్రాలు చూపిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంఘటనను నాలుగు, ఐదు తరగతుల విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ధర్నాకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Source: Way2news





