News

టీటీడీ జంబో బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు

284views

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డులోని కొత్త ముఖాలకు షాక్‌ ఇది. ఈ బోర్డు టీటీడీ నిబంధనలకు విరుద్దమని పిటీషన్‌ దాఖలు కావడంతో ఈమేరకు ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు. కొత్తగా నియమితులైన టీటీడీ బోర్డు సభ్యుల్లో 18 మందికి నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రత్యేక ఆహ్వానితుల వ్యవహారం సందిగ్ధంలో ప‌డింది.

టీటీడీ బోర్డులో సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం బోర్డు నియమించిన 24 మంది సభ్యుల్లో 14 మందిపై నేరారోపణలు ఉన్నాయని కోర్డుకు నివేదించారు. అంతేకాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న నలుగురిని సభ్యులుగా నియమించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. 18 మంది సభ్యులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పిటిషనర్‌ విజ్ఞప్తిని అంగీకరించిన ధర్మాసనం 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణనను దసరా సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి