
-
సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్
దేవగిరి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏకైక లక్ష్యం ఒక గొప్ప దేశాన్ని తయారుచేసే సమాజాన్ని రూపొందించడమే అని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. ఈ సింగిల్ పాయింట్ ఎజెండాతో, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిరంతరం సమాజంలో పనిచేస్తున్నారు. మొత్తం సమాజం కేవలం ప్రేక్షకుడిగా ఉండకుండా, జాతీయవాద శక్తుల ద్వారా జరిగే భారీ పనిలో పాల్గొనడం ద్వారా మాత్రమే దేశంలో అవసరమైన మార్పు కనిపిస్తుంది. ఔరంగాబాద్లో జరిగిన ఆర్ఎస్ఎస్ దేవగిరి ప్రార్థన మహా సంగమంలో పాల్గొన్న 60,000 మంది స్వయంసేవకులను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ సర్ సంఫ్ుచాలక్ ప్రసంగించారు.
దేవగిరి ప్రార్థనలో ఇదే మొదటి మహాసంగమని, ఇంత పెద్ద సంఖ్యలో మీరు పాల్గొన్నారని, ఇలా ఎటువంటి భేదాలు లేకుండా ఈ కార్యక్రమానికి హాజరుకావడం శుభపరిణామమని సర్ సంఘ్చాలక్ అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఇదో గొప్ప దృశ్యంలా కనిపిస్తోందన్నారు. డాక్టర్ అంబేద్కర్, సర్ మానవేంద్ర నాథ్ రాయ్లను ప్రస్తావించారు. ప్రతి వ్యక్తి జాతీయతా స్ఫూర్తిని గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ ఆలోచనలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకుంటూ, సమాజంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి స్థిరంగా ఉండే హిందూ సంస్కృతి, హిందూ ధర్మం అనే ఒక సాధారణ సంబంధం ద్వారా సమాజాన్ని ఏకం చేయాలని ఆయన సంకల్పించుకున్నారని భగవత్ అన్నారు.
‘అందరినీ అంగీకరించండి’ అనేది భారతదేశ పౌరుల్లో ఉండే సహజ మనస్తత్వమని భగవత్ అన్నారు. ప్రపంచం ‘సహనం’ గురించి మాట్లాడుతుండగా, హిందువు ‘అంగీకారం’ అనే గుణం గురించి మాట్లాడుతున్నాడు… హిందూ సంస్కృతి ఏకం అవుతుందని, అది వేల సంవత్సరాల నుండి కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
గొప్ప హిందూ దేశం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వీరులు, ధీరులు భారతీయులందరికీ పూర్వీకులేనని అన్నారు. ఆధునిక యుగంలో కూడా అదే సాంస్కృతిని, హిందూ వారసత్వాన్ని మన జీవితాలతో కొనసాగిస్తూ స్ఫూర్తి పొందాలని ఆయన దేశ ప్రజలందరినీ కోరారు.
సమాజంలో కులాల పేరిట అసమానతలు, సాంఘిక దురాచారాలు ఉండకూడదని, వాటిని పారద్రోలాల్సిన అవసరం ఉందన్నారు.
చరిత్రలో భారతదేశం గొప్పగా వెలుగొందుతున్నప్పుడు, ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉందని భగతవత్ చెప్పారు. జాతీయవాద స్ఫూర్తి పెరగాలి కాబట్టి ఆర్ఎస్ఎస్ పని పెరగాలని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ పనిలో చేరడం ద్వారా ఆర్ఎస్ఎస్లోని అసలైన పని ఏమిటనేది తెలుస్తుందని సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ నొక్కి వక్కాణించారు.
Source: VSK Bharat