
-
అసోంలో యథేచ్ఛగా సరఫరా
-
‘విలాసం’ ముసుగులో దొంగ వ్యాపారం
-
2 వేల మంది అరెస్టు
-
రూ. 350 కోట్ల విలువ చేసే సరుకు స్వాధీనం
-
వ్యూహాలు మార్చినా దెబ్బకొట్టిన పోలీసులు
గౌహతి: అసోంలోని మహిళా డ్రగ్ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ ఆపరేషన్లో మొత్తం రెండు వేల మందిని అరెస్టు చేసి, రూ.350 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని కొత్త బిజెపి ప్రభుత్వం డిస్పూర్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అసోం పోలీసులు రాష్ట్రంలో తీవ్రంగా వేళ్లూనుకున్న మాదకద్రవ్యాల రాకెట్లపై ఉక్కుపాదం మోపి, నిరంతరం వేట సాగించారు.
పోలీసుల వైపు నుంచి నిరంతర ఒత్తిడి కారణంగా, మాదకద్రవ్యాల రాకెట్ ముఠా కొత్త వ్యూహాలు రూపొందించుకుంది. అదనపు డీజీపీ, గౌహతి పోలీసు కమిషనర్ హర్మీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ‘డ్రగ్ రాకెట్లు ఇప్పుడు మహిళా డ్రగ్ పెడ్లర్లను ఉపయోగిస్తున్నాయి… వినియోగదారులకు తక్కువ మొత్తంలో డ్రగ్స్ను సరఫరా చేస్తున్నాయి’ అన్ని చెప్పారు.
గత రెండు నెలల పోలీసు రికార్డులను పరిశీలిస్తే, మాదకద్రవ్యాల విక్రయదారుల్లో ఎక్కువ మంది ముస్లిం మహిళలు ఉన్నట్టు స్పష్టం చేస్తోంది. గౌహతి నగర పోలీసులు గత రెండు నెలల్లో అనేక మంది ముస్లిం మహిళా డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. ఆగస్టు 11న, గౌహతి పోలీసులు ఒక ముస్లిం మహిళ(డ్రగ్ పెడ్లర్) రోంగ్మోలా బేగమ్ను అరెస్టు చేశారు.
నిందితురాలి నుంచి రెండు హెరాయిన్ సబ్బు పెట్టెలు, 99 సీసాలు, 300 ఖాళీ సీసాలు, 1,01,000 రూపాయలు, మూడు మొబైల్ హ్యాండ్సెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసులు అలాంటి డజన్ల కొద్దీ మహిళా డ్రగ్ పెడ్లర్లు గౌహతిలో చురుకుగా ఉన్నట్టు గుర్తించారు.
ఆగస్టు 16న, నగర పోలీసులు 10 గ్రాముల హెరాయిన్తో మరో ముస్లిం డ్రగ్ పెడ్లర్ రోనా బేగమ్ను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి నెక్సాన్ వాహనం, 40,000 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మహిళా డ్రగ్ పెడ్లర్లు విలాసవంతమైన వాహనంలో అధునాతన మార్గంలో సరుకును సరఫరా చేస్తారని పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. సరైన గోప్యత, పక్కా వ్యూహం లేకుండా, నిందితులను పట్టుకోవడం దాదాపు అసాధ్యమని వారన్నారు.
జూలైలో, నాగావ్ పోలీసులు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మహిళా డ్రగ్ పెడ్లర్లు జాస్మినా బేగం, షాహిదా బేగం, 14 మంది ఇతర డ్రగ్ పెడ్లర్లను భారీ మొత్తంలో డ్రగ్స్, నిషేధ వస్తువులతో అరెస్టు చేశారు. నాగావ్ పోలీసుల యాంటీనార్కోటిక్స్ బృందం, వారి విచారణలో, ఈ లేడీ డ్రగ్ పెడ్లర్లు పోలీసుల ఆపరేషన్ నుండి తప్పించుకోవడానికి శతవిధాల ప్రత్నించారు.
ఇందుకు సంబంధించి సామగ్రిని వారికి దగ్గర దాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. జూలై 6 న, సామగురి ప్రాంతానికి చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ముస్లిం డ్రగ్ పెడ్లర్లు జమీనా ఖతున్, జోష్నారా బేగంలను అరెస్టు చేశారు. సూత్రధారి జాకీర్ హుస్సేన్తో పాటు వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
అదే రోజు, నాగావ్ పోలీసులు సియాల్మారి ప్రాంతానికి చెందిన ఇతర ముస్లిం మహిళలను, డ్రగ్ పెడ్లర్ తస్లీమా బేగమ్ని అరెస్టు చేశారు. రూ .28 లక్షల విలువైన 400 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 11న, నాగావ్ పోలీసులు హజ్రా బేగం, నజీమా ఖతున్, అఫ్సానా బేగం అనే ముగ్గురు ముస్లిం డ్రగ్ పెడ్లర్లను పెద్ద మొత్తంలో డ్రగ్స్తో పట్టుకున్నారు.
జూరియా ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం మాదకద్రవ్యాల విక్రేత సాహిదా బేగం, హతిపారాకు చెందిన సద్దాం హుస్సేన్, ఎండీ జలాలుద్దీన్ కూడా కేరళకు గంజాయిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు నాగావ్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసు ఉన్నతాధికారులు విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసు డ్రగ్ రాకెట్ నుండి విపరీతమైన ఒత్తిడి వచ్చిన తర్వాత ఈ మహిళా డ్రగ్ పెడ్లర్లు పోలీసులను మోసం చేయడానికి తెలివిగా వ్యవహరిస్తున్నారు. కానీ జిల్లాలో చురుకుగా ఉన్న వందలాది మంది మహిళా వ్యాపారులను పట్టుకోవడానికి పోలీసులు కూడా అంతకంటే తెలివిగా వ్యవహరిస్తున్నారన్నారు.
Source: Organiser





