
లక్నో: ఉత్తరప్రదేశ్లో 1500 ఏళ్ళ పురాతన గుప్తుల కాలం నాటి దేవాలయ కట్టడాలు బయటపడ్డాయి. ఇటహ్లోని బిల్సర్హ్ గ్రామంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)వారి శోధనల్లో ఇవి కనిపించాయి. పురాతన కట్టడాలు ఉన్నట్టు గుర్తించి, సంరక్షిస్తున్న ప్రదేశాల్లో అధికారులు సున్నితంగా అక్కడిగల మట్టిని వివిధ పరికరాలతో తొలగించారు. ఈ దేవాలయాన్ని 1928 నుండి కాపాడుతున్నారు. ఈ దేవాలయానికి ముందు మెట్లు ఉన్నట్టు గుర్తించారు.
ఇటాలోని రక్షిత ప్రదేశంలో శాస్త్రీయంగా శుభ్రపరచడం ద్వారా వీటిని కనుగొన్నామని ఏఎస్ఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ కట్టడం అయిదో శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. ఒక శాసనం శంఖ్ లిపిలో ఉండడం, గుప్త వంశానికి చెందిన కుమార్ గుప్త కాలంలోదిగా గుర్తించారు. శంఖ్ లిపి ఒక పురాతన లిపి, 4వ నుండి 8వ శతాబ్దం వరకు వాడేవారని అధికారులు పేర్కొన్నారు.
కాగా, దీనికి ముందు డియోఘర్లోని దశావతార దేవాలయం, కాన్పూర్ దేహాట్లోని భితర్గావ్ ఆలయాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కొనుగొన్నారు. ‘ఈ ఆలయాల్లోని స్తంభాలు అలంకరించిబడి ఉన్నాయి. అంతేకాకుండా, మెట్లు కూడా కొంచెం అధునాతమైనవి’ అని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ మన్వేంద్ర పుంధీర్ స్పష్టం చేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఉదహరించింది.
అతను ఇంకా ఇలా చెప్పాడు… బ్రాహ్మణ, బౌద్ధ, జైన జనుల కోసం గుడులను నిర్మించిన మొదటి వ్యక్తులు గుప్తులు… అంతకు ముందు, రాక్-కట్ దేవాలయాలు మాత్రమే నిర్మించేవారని పేర్కొన్నారు.
Source : Organiser





