News

రామమందిర నిర్మాణంలో స్వల్పమార్పులు

797views
  • పునాది ప‌టిష్ఠంగా ఉండాల‌ని నిర్ణ‌యం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య శ్రీ రామ మందిరం పనులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ఆలయ పునాది రూపకల్పనలో 42 పొర‌ల‌ నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, రామాలయ రూపకల్పనలో పాక్షిక మార్పు జరిగింది. ఇప్పుడు పునాది పొర‌ల‌ సంఖ్య 44 కి బదులుగా 48 పొరలకు పెరిగింది. ఇది మాత్రమే కాకుండా పునాది రాఫ్ట్ మందం కూడా తగ్గించారు.

మునుపటి డిజైన్ ప్రకారం, పునాది రాఫ్ట్ మందం 2.5 మీటర్లు, ఇది ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు. ఫౌండేషన్ డిజైన్ ప్రకారం 44 పొరలు నిర్మించాల్సి ఉందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీనియర్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా అన్నారు. ఇప్పుడు దానిలో నాలుగు పొరలు పెంచినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు 42 లేయర్లు నిర్మాణం పూర్తయిందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి