
-
ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్
ముంబాయి: దేశ ఐక్యతకు ఆధారం మన మాతృభూమి, గర్వించదగిన సంప్రదాయమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. మా దృక్కోణంలో, హిందూ అనే పదం మాతృభూమి, పూర్వీకులు, భారతీయ సంస్కృతి వారసత్వానికి చిహ్నం! ‘హిందు’… ఇది కులం కాదు, భాషా నామవాచకం కాదు. కానీ, ప్రతి వ్యక్తి ఉన్నతికి మార్గనిర్దేశం చేసే సంప్రదాయం పేరు ఇది.
భాష, మతంతో సంబంధం లేకుండా వారు ఏది నమ్ముతారో వారు హిందువులే. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయ పౌరుడిని హిందువుగా భావిస్తాం. ఇక్కడ ఇతరుల అభిప్రాయానికి ఎలాంటి అగౌరవం ఉండదు. హిందువుకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. అతను ఎల్లప్పుడూ అందరి శ్రేయస్సుపై దృష్టి పెట్టాడు. కానీ.. మనం ముస్లింల ఆధిపత్యం గురించి కాకుండా భారతదేశ ఆధిపత్యం గురించి ఆలోచిస్తూ ఉండాలి.
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కలిసి నడవాలన్నారు. ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ‘నేషన్ ఫస్ట్-నేషన్ పారామౌంట్’ అనే థీమ్పై పూణేకి చెందిన గ్లోబల్ స్ట్రాటజిక్ పాలసీ ఫౌండేషన్(జీఎస్పీఎఫ్) సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని, మాట్లాడారు.
భారత్కు ఇస్లాం దూకుడుతో వచ్చింది…
ఇంకా, డాక్టర్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, ఇస్లాం భారతదేశానికి దూకుడుతో వచ్చిందని, ఇది చరిత్ర అని, దానిని అలాగే చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ముస్లిం సమాజంలోని తెలివైన నాయకత్వం నిరంకుశ విషయాలను వ్యతిరేకించాలన్నారు. ఛాందసవాదుల ముందు ధైర్యంగా మాట్లాడవలసి ఉంటుంది… ఈ పని సుదీర్ఘ ప్రయత్నం, సంకల్పంతో చేయాలి. మనందరి పరీక్ష సుదీర్ఘమైనది, కఠినమైనది.
మనం ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత తక్కువ హాని మన సమాజానికి జరుగుతుంది. భారతదేశం ఒక సూపర్ పవర్ అయితే, అది ఎవరినీ భయపెట్టదు. భారతదేశం ఒక సూపర్ పవర్ అవుతుంది. అది విశ్వగురు రూపంలో ఉంటుంది. శతాబ్దాలుగా, మేము అన్ని జీవులు, జీవం లేనివారి అభ్యున్నతి కోసం ప్రయత్నిస్తున్నాము. ఈ కారణంగా, భారతదేశం సూపర్ పవర్ అవుతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఒక దేశంగా ఐక్యంగా ఉండాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉంది. మేము మీకు చెప్పడానికి వచ్చినది ఇందుకే…
వైవిధ్యానికి పాతర వేసినచోట దుష్ఫలితాలు: కేరళ గవర్నర్

ప్రపంచంలో ఎక్కడ వైవిధ్యం నిర్మూలనకు గురైందో అక్కడ దుష్ఫలితాలు సంభవించాయని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నారు. అలాగే, ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ వైవిధ్యం ఉందో అక్కడి సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిలో అలా చెడ్డపనులు చేసిన వారెవరూ లేరు. ఎందుకంటే, ప్రతీ జీవిని సమానం చూసే గుణం భారతీయుల్లో ఉంది. ఇక్కడ అంతా సమానమే.
ముస్లిం మేధావులు పాక్ కుట్రను తిప్పికొట్టాలి: సయ్యద్ అతా హుస్సేన్

1971 తర్వాత, పాకిస్తాన్ ఒక గొప్ప వ్యూహం కింద భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నింది…. గత 30 ఏళ్లలో భారత ప్రభుత్వం, సైన్యం, పోలీసులు, కాశ్మీరీ ప్రజలు ఈ కుట్రను ధ్వంసం చేశారని కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సయ్యద్ అతా హుస్సేన్ మాట్లాడుతూ అన్నారు. కానీ, మారుతున్న పరిస్థితుల్లో భారతీయ ముస్లింలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకోవచ్చు. ముస్లిం మేధావులు అప్రమత్తంగా ఉండి, ఈ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Source : VSK TN





