
605views
పంజాబ్లోని భారత్- పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది. అనుమానాస్పదంగా ఉన్న ఓ డ్రోన్ను సరిహద్దు భద్రతా సిబ్బంది కూల్చేశారు. ఈ ఘటన పంజాబ్లోని తార్న్తరాన్ జిల్లాలో జరిగినట్టు అధికారులు తెలిపారు.
డ్రోన్ చక్కర్లు కొడుతుండడం గమనించిన వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు. దానిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ డ్రోన్ నుంచి ఎటువంటి పేలుడు పదార్థాలు, మరే ఇతర అనుమానిత వస్తువులు స్వాధీనం చేసుకోలేదని వివరించారు.





