News

ట్రైబల్స్ ను మతం మారుస్తున్న పాస్టర్ పై దాడి

1.1kviews

త్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో ఓ పాస్టర్ పై ఆదివారం నాడు దాడి జరిగింది. మత మార్పిడి చేస్తున్నాడనే అభియోగాలపై అతడిపై దాడి చేశారు. పాస్టర్ మరియు అతని కుటుంబంపై 100 మందికి పైగా దాడి చేశారు. గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో సామూహిక మత మార్పిడులకు వ్యతిరేకంగా దాడులు జరిగాయని పోలీసు అధికారులు తెలిపారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఆగష్టు 29 ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రార్థన జరుగుతుండగా పాస్టర్ కావల్సింగ్ పరాస్తే ఇంట్లోకి దుండగులు చొరబడి.. దాడి చేశారు. పరాస్తే ఇంటిని కూడా ధ్వంసం చేశారని చెబుతున్నారు.

కబీర్‌ధామ్ పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. ‘ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మందికి పైగా స్థానికులు అతని ఇంట్లోకి చొరబడ్డారని.. ఆరాధనకు సంబంధించిన వస్తువులను ధ్వంసం చేసి, పత్రికలను కూడా చింపివేశారు’ అని చెప్పారు. మత మార్పిడులను ఆపాలని నినాదాలు చేశారని ఆయన అన్నారు. దాడి గురించి అప్రమత్తమైన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుందని గార్గ్ సమాచారం అందించారు. ఈ విషయంలో కేసు నమోదైంది తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయని గార్గ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.