
గ్యాంగ్ స్టర్స్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లకు ముఖ్య అనుచరుడు అయిన ఫహీమ్ మచ్మచ్ శుక్రవారం రాత్రి కోవిడ్ -19 తో మరణించినట్లు సమాచారం. అతను పాక్ లోని కరాచీలో మరణించాడు. అతనికి చాలా సంవత్సరాలుగా దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ ఇద్దరితో సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. దక్షిణాఫ్రికాలో గుండెపోటుతో ఫహీమ్ మచ్మచ్ మరణించాడని చోటా షకీల్ చెబుతున్నాడు. దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్తో కలిసి ఫహీమ్ ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. అతను పాకిస్తాన్లో ఉండేవాడని ఇంటెలిజెన్స్ తెలిపింది. ఆ వార్తల్లో నిజం లేదని, ఫహీం దక్షిణాఫ్రికాలో గుండెపోటుతో మరణించాడని చోటా షకీల్ తెలిపాడు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ మరియు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు హత్య, దోపిడీ కేసులలో గతంలో ఫహీమ్ ను అరెస్టు చేయాలని ప్రయత్నించారు. అతను దావూద్ ఇబ్రహీం ముఠా యొక్క అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఒకడు. విధేయులలో ముఖ్యుడు. అతను ముంబైలోని తన వ్యక్తుల ద్వారా గ్యాంగ్ కోసం కార్యకలాపాలు నడిపాడు. హత్యాయత్నం, హత్య, దోపిడీ వంటి కేసుల్లో ముంబై క్రైం బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫహీం మోస్ట్ వాంటెడ్. ముంబైలోని తన మనుషుల ద్వారా దావూద్ గ్యాంగ్ కు పనులు చేసిపెట్టాడు.. ఫహీమ్ మృతి చెందినట్టు తమకూ సమాచారం అందిందని అయితే, ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు తెలిపాయి.





