
948views
ఆఫ్గనిస్థాన్లో భద్రతా బలగాలు, తాలిబన్ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే తమ వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్లు హతమవగా.. మరో 309 మంది గాయపడ్డారని అఫ్గాన్ ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తాలిబన్లపై అమెరికా వైమానిక దళ సాయంతో ఈ దాడులు జరిపినట్లు ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. మరోవైపు.. తాలిబన్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస బెట్టి నగరాలను ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే కీలక ప్రాంతాలైన తఖర్, జాజ్వన్, నిమ్రోజ్ వారి అధీనంలోకి వెళ్లగా.. తాజాగా కీలక కుందూజ్ ప్రావిన్స్ రాజధానిలోని పలు ప్రాంతాలను వశం చేసుకున్నారు.





