రాజస్థాన్ : చెత్తబుట్టలో వ్యాక్సిన్లు – ఇంకా వ్యాక్సిన్లు పంప లేదంటూ కేంద్రంపై ముఖ్యమంత్రి చిందులు

2500కు డోసులకు పైగా కోవిడ్ 19 వ్యాక్సిన్లు చెత్తబుట్టలలో దర్శనమిచ్చిన దిగ్భ్రాంతికరమైన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ జరిపిన శోధనలో రాజస్థాన్ రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలలోని 35 వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఇలా వ్యాక్సిన్ను వృధాగా చెత్తబుట్టలలో పడేస్తున్న విషయాన్ని గుర్తించారు.
తమ రాష్ట్రానికి తగినన్ని వ్యాక్సిన్లు పంప లేదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తరచుగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉండటం గమనార్హం. నిజానికి దేశంలోని అన్ని రాష్ట్రాల లాగే ఆ రాష్ట్రంలో కూడా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అక్కడ సుమారుగా 11.5 లక్షల డోసుల వ్యాక్సిన్ వృధా అయింది. ఒక్క ఆదివారం నాడే ఆ రాష్ట్రంలో 2200 పైచిలుకు కోవిడ్ కేసులు నమోదవడం గమనార్హం.
ఆ రాష్ట్రంలోని 7 జిల్లాలలో పది శాతం కంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నెలకు పైగా ఇక్కడ లాక్ డౌన్ అమలవుతూ ఉంది. జూన్ 8 వరకు లాక్ డౌన్ ను పొడగించారు కూడా.
గత సోమవారం రాజస్థాన్లోని జైపూర్ లో పట్టపగలే ఒక గర్భిణి అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజు దంపతులను దుండగులు కాల్చి చంపారు. మరో అత్యాచార బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. పరిస్థితిని బట్టి చూస్తుంటే రాజస్థాన్ నేరస్తుల స్వర్గధామంగా మారిపోయిందనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Source : Organiser
https://www.organiser.org/Encyc/2021/5/31/More-Than-2500-Doses-of-Covid-19-Vaccine-Found-in-Dustbins-in-Rajasthan.html





