శాంతియుతంగా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శాఖపై దాడి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) దైనందిన కార్యక్రమాల్లో భాగమైన శాఖ ఎంతో కాలంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం మైదానంలో ప్రశాంతంగా జరుగుతోంది. ఆర్ఎస్ఎస్కు వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగానూ, విశాఖ నగరంలోనూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను సహించలేని కొన్ని శక్తులు మంగళవారం రాత్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం బాస్కెట్ బాల్ కోర్టు వద్ద జరుగుతున్న శాఖ పై దాడి చేశాయి. దాడి జరుగుతున్న సమయంలో స్వయంసేవకులు భారతమాతను కీర్తిస్తూ ప్రార్థన చేస్తున్నారు. భారత్ మాతాకీ జై అంటూ ప్రార్థన చేస్తుండగా కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా నినాదాలతో కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంఘ కార్యకర్తలు సమయమనం కోల్పోలేదు. పోలీసుల సమక్షంలో ఇదంతా జరిగింది. అయితే విచిత్రంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కవాతు చేశారంటూ కొన్ని...






