ఆలయాల నిర్మాణానికి టిటిడి నిధులు
ప్రజల్లో ఆధ్యాత్మికత.. భక్తిభావాన్ని పెంపొందించేందుకు గ్రామాల్లో నూతన ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ముందుకొచ్చింది. శ్రీవాణి భజన మండప పథకం కింద దేవాలయాలు నిర్మించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారుల కాలనీల్లో నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. స్థలం కేటాయిస్తే చాలు...







