
65views
‘బంగ్లాదేశ్ అగ్నివీర్’ అనే ఒక హిందూ సంస్థ, మార్చి 27న బంగ్లాదేశ్ సిల్హెట్ లోని లామా బజార్లో త్రి దేవాలయ సమాజంలో శ్రీ రామ నవమిణి ఉత్సవాన్ని అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. శివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సమాజానికి చెందిన వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ వేడుక గురించి స్థానిక హిందువులు తెలియజేశారు.
కార్యక్రమంలో భాగంగా సీతా రాములకు ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత భక్తి గీతాలను ఆలపించారు. మూడు చిన్న బృందాలుగా విభజించి, పిల్లల కోసం ఒక చిత్రలేఖన పోటీని ప్రదర్శనను నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముని జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు, సర్వుల శ్రేయస్సును కాంక్షిస్తూ ‘వైదిక శాంతి యజ్ఞం’ నిర్వహించారు. ఆ తర్వాత ‘బ్రహ్మ సంగీతాన్ని’ వినిపించారు. ఈ కార్యక్రమం అనంతరం ఒక చర్చా గోష్ఠిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు, యువత యొక్క ఆరోగ్యకరమైన మానసిక వికాసానికి వారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ఎంత ఆవశ్యకమో తెలియజేశారు





