హే జగన్నాథ.. పాహిమాం!
విజయనగరంలోని సంతపేట, దాసన్నపేట, కొత్తపేటలో జగన్నాథస్వామి తొలి రథయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. సంతపేటలో ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తులను రథంపై ఉంచారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లారు. దాసన్నపేటలో సుప్రభాతసేవ, విశేష అర్చనలు, నైవేద్యం, నీరాజనం అనంతరం క్రతువు సాగింది....







