
అల్వార్: రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఒక పేద హిందూ కూరగాయల వ్యాపారిని ముస్లిం గుంపు ‘దొంగ’ అని అనుమానించి, దారుణంగా కొట్టి చంపింది. మృతి చెందిన ఆ వ్యక్తి చిరంజీ లాల్ సైనీ(50)గా పోలీసులు గుర్తించారు. ముస్లిం గుంపు దాడిలో తీవ్ర గాయాలకు గురైన ఆయన ఒక రోజు తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. ఆ రోజు ఆగస్టు 15. దేశం మొత్తం 75 ఏళ్ళ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకొంటుండగా ఆ ఇంట్లో మాత్రం ముస్లింల వల్ల విషాదం నెలకొంది.
చిరంజీ లాల్ సైనీ కుమారుడు యోగేష్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. చిరంజీవి లాల్ ఆగస్ట్ 14న తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో అవసర నిమిత్తం పొలాల్లోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా, ఒక ట్రాక్టర్ (ఇండియా టుడే నివేదిక ప్రకారం దొంగిలించబడింది) అక్కడికి వచ్చింది. దాని వెనుక
15-20 మందితో స్కార్పియో వచ్చి ఆగింది. వారి చేతుల్లో కత్తులు, ఇతర పదునైన ఆయుధాలు ఉన్నాయి. వారంతా ట్రాక్టర్ యజమాని విక్రమ్ ఖాన్(జుమ్మె ఖాన్ కుమారుడు) అనుచరులు.
వారంతా ఒక్కసారిగా చిరంజీలాల్పై దాడికి దిగారు. అతని కేకలు విని, యోగేష్, అతని మేనమామలు అక్కడికి పరుగెత్తారు. వారు ఖాన్ను సమీపించడం చూసి అతని మనుషులు వెళ్ళిపోయారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్ప్రతికి తరలించారు. అక్కడ నుండి అల్వార్కు రిఫర్ చేసి, అక్కడి నుండి జైపూర్కు తరలించారు. కానీ అతను ప్రాణాలతో బయటపడలేదు.
ఈ ఘటన గోవింద్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్వార్ జిల్లా రాంబాస్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇండియా టుడే నివేదిక ఇలా చెబుతోంది, “బాధితుడు పొలంలో ఉన్న సమయంలో, ట్రాక్టర్ను దొంగిలించిన దొంగలు ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి వస్తున్నారు. పోలీసు అధికారులు, వాహన యజమాని వెంబడించారు. దొంగలు ట్రాక్టర్ను పొలంలో వదిలేసి పారిపోయారు. అయితే, ఆ ట్రాక్టర్ యజమాని చిరంజీ లాలే దొంగ అని తప్పుగా అర్థం చేసుకుని, అతనిని కొట్టారు.
ఈ సంఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఆగ్రహించిన నిరసనకారులు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గోవింద్గఢ్ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. ఈ కేసులో నిందితులందరినీ పట్టుకునే వరకు చిరంజీ లాల్ సైనీ మృతదేహానికి అంత్యక్రియలు జరపబోమని నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు. 50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చిరంజీ లాల్ సైనీ ఓబీసీ హిందూ కమ్యూనిటీకి చెందినవారు.
Source: HINDU POST





